
కొడుకును చూసేందుకు వచ్చి గుండెపోటుతో మృతి
వేములవాడఅర్బన్: రాజన్న ఆలయ అనుబంధ సంస్కృత పాఠశాలలో చదువుతున్న కుమారుడు సుశాంత్ను చూసేందుకు వచ్చిన తల్లి చందన(32) గుండెపోటుతో మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. జగిత్యాల జిల్లా పొలాసకు చెందిన చందన–నరేశ్ దంపతుల కుమారుడు సుశాంత్ను వారం క్రితం రాజన్న ఆలయ అనుబంధ సంస్కృత పాఠశాలలో ఆరో తరగతిలో చేర్పించారు. సుశాంత్ను చూడటానికి గురువారం తల్లిదండ్రులు వచ్చారు. అనంతరం చందన పై అంతస్తులో ఉన్న వాష్రూమ్కు వెళ్లి అక్కడే కుప్ప కూలిపోయింది. గమనించిన సిబ్బంది సమాచారంతో వెంటనే చేరుకున్న ఉపాధ్యాయుడు ఆమెకు సీపీఆర్ చేశారు. అక్కడికొచ్చిన ఆర్బీఎస్కే వైద్యుల సైతం ప్రాథమిక చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అనంతరం 108 వాహనంలో వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు.
వేములవాడ సంస్కృత పాఠశాలలో ఘటన