పిల్లలు బడిబాట | - | Sakshi
Sakshi News home page

పిల్లలు బడిబాట

Jun 27 2025 4:17 AM | Updated on Jun 27 2025 4:17 AM

పిల్ల

పిల్లలు బడిబాట

ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన ఎన్‌రోల్‌మెంట్‌
● అత్యధిక విద్యార్థుల నమోదుతో జగిత్యాల టాప్‌ ● తక్కువ నమోదుతో సిరిసిల్ల లాస్ట్‌ ● గతేడాది కన్నా పెరిగిన విద్యార్థుల నమోదు

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌ :

డిబాట కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటూ ప్రభుత్వం, విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు చేసిన ప్రచారం ఫలించింది. 2024–25 విద్యా సంవత్సరం కన్నా ఈసారి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌లో పురోగతి కనిపించింది. కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో పెరుగుదల నమోదవడాన్ని అంతా స్వాగతిస్తున్నారు. జగిత్యాల 39శాతం పెరుగుదలతో తొలిస్థానంలో నిలవగా కరీంనగర్‌ 32శాతంతో రెండోస్థానం దక్కించుకుంది. ఇక పెద్దపల్లి 19శాతంతో మూడోస్థానంలో నిలవగా సిరిసిల్ల 10శాతంతో నాలుగోస్థానం దక్కించుకుంది. ఈ పురోగతిలో జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖాధికారులు, ఎంఈవో, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కృషి ఉంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల సిబ్బంది తమ పరిధిలో విద్యార్థులను ప్రభుత్వపాఠశాలలో చేర్చాలని ఇంటింటి ప్రచారం నిర్వహించడం కలిసొచ్చింది. చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులు సొంతఖర్చులు వెచ్చించి మరీ ప్లెక్సీలు, పోస్టర్లు, రీల్స్‌, వీడియోలు, సోషల్‌ మీడియా ద్వారా విరివిగా ప్రచారం చేశారు. ఆ ప్రయత్నాల ఫలితాలే ఈ ఏడాది విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ పెరిగేలా చేశాయి.

అగ్రభాగాన జగిత్యాల..

ఈ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జగిత్యాల అగ్రభాగన నిలవడం వెనక పలు కారణాలు ఉన్నాయి. భౌగోళిక విస్తీర్ణంలో జగిత్యాల పెద్దది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటం, గ్రామీణ జనాభా అధికంగా ఉండటం వంటి అంశాలు కలిసి వచ్చాయి. కలెక్టర్‌, డీఈవో, ఎంఈవోలు క్రమశిక్షణతో పనిచేయడం ఎన్‌రోల్‌మెంట్‌ పెరుగుదలకు దోహదం చేసింది. ఇక మిగిలిన జిల్లాలు విస్తీర్ణం, జనాభా పరంగా చిన్నవి కావడంతో ఎన్‌రోల్‌మెంట్‌లోనూ జగిత్యాల తరువాత స్థానంలో నిలిచాయి. కరీంనగర్‌తోపాటు సిరిసిల్లకు ఇన్‌చార్జిగా ఉండే డీఈవోను ఇటీవల వివాదాస్పద ప్రవర్తనతో ఉన్నతాధికారులు తప్పించారు. అనంతరం కామారెడ్డి డీఈవోకు సిరిసిల్ల అదనపు బాధ్యతలు ఇచ్చినా.. ఆయన విధుల్లో చేరలేదు. దీంతో జెడ్పీ సీఈవోకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. టీచర్ల విషయంలో పర్యవేక్షణ కొరవడి ఎన్‌రోల్‌మెంట్‌లో కాస్త వెనకబడింది. రాజన్నసిరిసిల్ల చిన్న జిల్లా కావడం, విస్తీర్ణపరంగా, జనాభాపరంగా చిన్నది కావడం కూడా కారణాలే.

ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల వివరాలు

జిల్లా గతేడాది ఈ ఏడాది పెరుగుదల (శాతం)

జగిత్యాల 3,690 5,147 39

కరీంనగర్‌ 4,831 6,393 32

పెద్దపల్లి 3,612 4,295 19

సిరిసిల్ల 6,280 6,901 10

తల్లిదండ్రులను ఒప్పించాం

బాలల బలోపేతం కోసం బడిబాటలో ప్రతీ ఇంటి తలుపుతట్టి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం. ఉచిత యూనిఫారాలు, పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేశాం. నాణ్యమైన భోజనం, ప్రత్యేక తరగతుల గురించి వివరించాం. ఖర్చుల భారం తగ్గడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ప్రారంభించారు.

– కె.రాము, డీఈవో, జగిత్యాల

పిల్లలు బడిబాట1
1/1

పిల్లలు బడిబాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement