అమ్మవారికి పుదీన మాల | - | Sakshi
Sakshi News home page

అమ్మవారికి పుదీన మాల

Jun 27 2025 4:17 AM | Updated on Jun 27 2025 4:17 AM

అమ్మవ

అమ్మవారికి పుదీన మాల

విద్యానగర్‌(కరీంనగర్‌): నగునూర్‌లోని దుర్గాభవానీ ఆలయంలో జరుగుతున్న ఆషాఢమా సం శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు గురువారం అమ్మవారిని పుదీనా మాలలతో అలంకరించారు. విశేష హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో ఆలయ ఫౌండర్‌ చైర్మన్‌ వంగల లక్ష్మణ్‌, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు

మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌

మానకొండూర్‌: నియోజకవర్గంలో అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలోని కరీంనగర్‌–వరంగల్‌ రహదారిపై మాజీ జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్‌ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా రసమయి మాట్లాడుతూ, నియోజకవర్గంలో 48వేల మంది దరఖాస్తు చేసుకుంటే 2 వేల మందికి మంజూరు చేశారని, డబ్బు, కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. అర్హులకు ఇళ్లు ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే కాంగ్రెస్‌ నాయకులు అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. ఇళ్ల మంజూరు విషయంలో బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ నాయకుల అరెస్ట్‌

మండలకేంద్రంలో బీఆర్‌ఎస్‌ చేపట్టిన ధర్నాను అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ నాయకులు అధిక సంఖ్యలో హాజరై పల్లెమీద చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. వారిని అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. పోలీసులకు, కార్యకర్తలకు తోపులాట జరిగింది. కార్యకర్తలను అదుపులోకి తీసుకుని హుజూరాబాద్‌, కేశవపట్నం పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

క్షయ నిర్మూలన అందరి బాధ్యత

కరీంనగర్‌టౌన్‌: క్షయ నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా టీబీ అధికారి డాక్టర్‌ రవీందర్‌రెడ్డి అన్నారు. క్షయ నివారణ విభాగం, టీబీ అలర్ట్‌ ఇండియా– ఇంపాక్ట్‌ ఇండియా ప్రాజెక్ట్‌ సహకారంతో గురువారం కరీంనగర్‌ మండలం పరిషత్‌ కార్యాలయంలో టీబీ చాంపియన్స్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షయతో బాధపడేవారు తగు జాగ్రత్తలు వహించడం వల్ల ఇతరులకు వ్యాధి సంక్రమించకుండా ఉంటుందని సూచించారు. ప్రభుత్వం ఈ వ్యాధికి ఉచిత వైద్యం అందిస్తుందని లక్షణాలు ఉన్నవారు అశ్రద్ధ వహించకుండా వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. డాక్టర్‌ సురేందర్‌, డాక్టర్‌ సాయి ప్రసాద్‌, ఎల్లయ్య, వనిత, శ్రీను, రాజబోస్‌, పారిజాతం రాజేందర్‌, అనిల్‌, ఆశా వర్కర్స్‌ పాల్గొన్నారు.

ఆఫీసర్లను కలవాలంటే టైం పాటించాల్సిందే..

కరీంనగర్‌ అర్బన్‌: కలెక్టరేట్‌లో ప్రధాన విభాగ అధికారులను కలవాలంటే సమయాన్ని అనుసరించాల్సిందే. రాజకీయ, ఇతర వ్యక్తులు కార్యాలయాల్లోనే తచ్చాడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పనివేళల్లో మద్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు మాత్రమే అధికారులు, సిబ్బందిని కలవచ్చని బోర్డును ఏర్పాటు చేశారు.

అమ్మవారికి పుదీన మాల
1
1/3

అమ్మవారికి పుదీన మాల

అమ్మవారికి పుదీన మాల
2
2/3

అమ్మవారికి పుదీన మాల

అమ్మవారికి పుదీన మాల
3
3/3

అమ్మవారికి పుదీన మాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement