బిర్యాని కోసం వెళ్లి.. మృత్యు ఒడికి | - | Sakshi
Sakshi News home page

బిర్యాని కోసం వెళ్లి.. మృత్యు ఒడికి

Jun 26 2025 10:04 AM | Updated on Jun 26 2025 10:04 AM

బిర్యాని కోసం వెళ్లి.. మృత్యు ఒడికి

బిర్యాని కోసం వెళ్లి.. మృత్యు ఒడికి

పెగడపల్లి(ధర్మపురి): మండలంలోని నర్సింహునిపేటలో మంగళవారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో గాయపడిన భోగ సత్యనారాయణ (30) చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై కిరణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన బోగ సత్యనారాయణ, తాటిపాముల భాస్కర్‌, తాటిపాములు మధూకర్‌, కొత్తూరి నవీన్‌ నలుగురు స్నేహితులు. మంగళవారం సాయంత్రం మద్యం సేవించారు. బిర్యాని తినేందుకుని రామడుగు మండలం గోపాల్‌రావుపేటకు రెండు ద్విచక్రవాహనాలపై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పెగడపల్లికి వస్తున్న క్రమంలో నర్సింహునిపేటలో ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ఉన్న స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద ముందుగా వెళ్తున్న ద్విచక్రవాహనాదారు అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో వెనుకాల వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొట్టగా నలుగురూ కిందపడిపోయారు. ఈప్రమాదంలో సత్యనారాయణ తీవ్రంగా గాయపడగా భాస్కర్‌, నవీన్‌, మధూకర్‌కు స్వల్ప గాయాలయాయ్యయి. చికిత్స నిమిత్తం వీరిని 108 వాహనంలో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ చికిత్స పొందుతూ బుధవారం వేకువజామున మృతి చెందాడు. మృతుడి తల్లి వజ్రవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని..

ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement