
పారమిత విద్యార్థుల ప్రతిభ
కరీంనగర్: నగరంలోని జ్యోతినగర్ పారమిత ఎక్స్ఫ్లోరికా ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన 6వ తరగతి విద్యార్థులు ఇటీవల ప్రకటించిన కేంబ్రిడ్జ్ ప్రైమరీ చెక్ పాయింట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. ప్రైమరీ చెక్ పాయింట్ ఫలితాల్లో అంతర్జాతీయ స్థాయిలో సగటు 33వ స్థానం సాధించారు. విద్యార్థులందరూ ప్రతీ సబ్జెక్టులో 95శాతం కంటే ఎక్కువ స్కోర్ సాధించారని ప్రిన్సిపాల్ శర్మిష్ఠ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ డా. ప్రసాద్రావు మాట్లాడుతూ, ఈ విజయంతో కరీంనగర్ విద్యార్థుల ప్రతిభ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని ప్రశంసించారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. పాఠశాల డైరెక్టర్స్ ప్రసూన, రశ్శిత, అనూకర్రావు, వినోద్రావు, రమణ, వీయూఎం ప్రసాద్, హనుమంతరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.