
మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు ?
వేములవాడ: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేరును ఓటర్ జాబితా నుంచి తొలగించేందుకు రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేసినట్లు తెలిసింది. ఈమేరకు పట్టణంలోని బైపాస్రోడ్డులో గల రమేశ్బాబు నివాసానికి బుధవారం నోటీసు అంటించడంతోపాటు ఆయన అడ్రస్పై రిజిస్టర్డ్ పోస్టు చేసినట్లు సమాచారం. రమేశ్బాబు జర్మనీ పౌరుడేనని హైకోర్టు నిర్ధారించడంతో ఓటర్ జాబితా నుంచి ఫామ్–7 ప్రకారం పేరును తొలగిస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. ఓటర్ జాబితా నుంచి పేరు తొలగింపుపై అభ్యంతరాలు ఉంటే ఏడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకే ఎన్నికల ఓటర్ జాబితా నుంచి పేరు తొలగిస్తూ నోటీసులు జారీచేసినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడిస్తున్నారు.
సురక్షితంగా గమ్యం చేర్చాలి
విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలో 35 మంది డ్రైవర్లను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఎంపిక చేసి బుధవారం వివిధ డిపోలకు కేటాయించినట్లు రీజనల్ మేనేజర్ బి.రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీలో పనిచేయడం వల్ల ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. మద్యం, సెల్ఫోన్ డ్రైవింగ్కు దూరంగా ఉండి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ (ఆపరేషన్స్) ఎస్.భూపతిరెడ్డి, పర్సనల్ ఇన్చార్జి ఆఫీసర్ బి.సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
కపిల్ విద్యావారధికి స్పందన
జమ్మికుంటరూరల్(హుజూరాబాద్): మండలంలోని కోరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2024–25 సంవత్సరం 10వ తరగతిలో విద్యార్థిని గిరవేన స్పందన ఉత్తమ మార్కులతో మండల టాపర్గా ర్యాంకు సాధించింది. ఇటీవల కపిల్ చిట్ఫండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో మంచి మార్కులు సాధించి కపిల్ విద్యావారధికి ఎంపికై ంది. విద్యార్థిని ఎంత వరకు చదివితే ఆ కోర్సులకు సంబంధించిన ఫీజులు మొత్తం కపిల్ చిట్ఫండ్సంస్థ చెల్లిస్తుంది. ఈ సందర్భంగా ఎంఈవో హేమలత, హెచ్ఎం సమ్మయ్య, అమ్మ ఆదర్శ కమిటీ చైర్ పర్సన్ బండారి రజిత, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాళ్ళపెల్లి శ్రీనివాస్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
ఖాతాదారుల సొమ్ము స్వాహా..
చందుర్తి(వేములవాడ): పోస్టాఫీస్లో ఖాతాదారుల సొమ్ము స్వాహా చేసిన పోస్ట్మాస్టర్ను పోలీసులు అ రెస్ట్ చేశారు. సీఐ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించా రు. చందుర్తి మండలం మల్యాల తపాలాశాఖ కా ర్యాలయంలో అసిస్టెంట్ పోస్ట్మాస్టర్గా పని చేస్తు న్న ఎండీ షరీఫ్ ఖాతాదారుల సొమ్ము రూ.50,600 స్వాహా చేశాడని జగిత్యాల వెస్ట్ సబ్డివిజన్ తపాలాశాఖ అధికారి ఎండీ సఫీయొద్దీన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఖాతానంబర్ల ఆధారంగా విచారణ చేపట్టి రూ.50,600 పక్కదారి పట్టినట్లు గుర్తించారు. షరీఫ్ను అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ వివరించారు. సమావేశంలో చందుర్తి ఎస్సై రమేశ్, కానిస్టేబుల్స్ చైతన్య, కిషన్ ఉన్నారు.

మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు ?