
అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తేనే కిందకు దిగుత!
కొత్తపల్లి(కరీంనగర్): రోడ్డును కబ్జా చేసి చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని డిమాండ్చేస్తూ కరీంనగర్ నగరపాలక సంస్థ సీతారాంపూర్ (21వ డివిజన్) పరిధిలోని టీచర్స్ కాలనీలో బుధవారం వెంకటేశ్వర్రావు అనే వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ని రసన తెలిపాడు. బాధితుడు తెలిపిన వివరాలు.. 30 ఏళ్ల క్రితం సీతారాంపూర్లోని 13వ సర్వేనంబర్ భూమిలో 126 ప్లాట్లతో టీచర్స్కాలనీగా లే అవుట్ చేయగా, కాలనీ అధ్యక్షుడి సహకారంతో 128 ప్లాట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి రోడ్డును ఆక్రమించారని ఆరోపించాడు. 2015లో డీపీవోకు ఫి ర్యాదు చేయగా అప్పటి కార్యదర్శిని నివేదిక ఇవ్వాలని ఆదేశించారని, తర్వాత మున్సిపల్లో విలీనం కావడంతో కమిషనర్కు విన్నవించగా.. అప్పుడు ని ర్మిస్తున్న రేకుల షెడ్డును కూల్చివేసారని పేర్కొన్నా రు. మళ్లీ ఇప్పుడు మున్సిపల్ అనుమతి ఉందని ని ర్మాణాలు చేపడుతుంటే మూడుసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఏ ఒక్క అధికారి పట్టించుకో కుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది తన ఒక్కడి సమస్య కాదని, కాలనీలోని పలువురి ఆందోళన చూడలేక ట్యాంక్ ఎక్కానని, టీచర్స్ కాలనీ లే అవుట్ భూములపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టి కబ్జాదారులపై చర్యలు తీసుకొని, రోడ్డు ఆక్రమణ తొలగించాలని విన్నవించారు. కాగా మున్సిపల్ అధికారులు, పోలీసులు బాధితుడిని కిందకు దింపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొన్ని గంటల పాటు జరిగిన హైడ్రామాకు మున్సిపల్ అధికారుల హామీతో తెరపడింది.

అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తేనే కిందకు దిగుత!