
మళ్లీ రోడ్డెక్కిన ఔట్సోర్సింగ్ సిబ్బంది
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య గురుకులం ఆశ్రమ పాఠశాలలో పనిచేసిన ఔట్సోర్సింగ్ సిబ్బంది రెండో సారి బుధవారం నిరసనకు దిగారు. విధుల్లోకి తీసుకోవాలన్న గురుకులాల సెక్రటరీ ఉత్తర్వులను సైతం ప్రిన్సిపాల్ బేఖాతర్ చేస్తున్నారని పేర్కొంటూ గేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. వీరికి గిరిజన సంఘాల నాయకులు అజ్మీరా తిరుపతినాయక్, అజ్మీరా రాజునాయక్, ప్రభునాయక్, గుగులోత్ సురేష్నాయక్, భూక్య గజన్లాల్ మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ సస్పెన్షన్కు గురైన ప్రిన్సిపాల్ మంజిత్ కొనసాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది శ్రీనివాస్, అశోక్, జగన్, నిర్మల, సుజాత, బాలు మాట్లాడుతూ.. ఇన్చార్జి ప్రిన్సిపాల్ రామ్సూరత్యాదవ్ తమను స్కూల్కు రమ్మని చెప్పి తాను రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. తమ సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. తిరిగి విధుల్లోకి తీసుకోకుంటే పాఠశాల ముందు ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరించారు.
కొనసాగుతున్న సస్పెండైన ప్రిన్సిపాల్
గురుకులాల సెక్రటరీ ఉత్తర్వులు బేఖాతర్