
పొలం నుంచి మట్టి వద్దన్నందుకు దాడి
వెల్గటూర్: తన పొలం నుంచి మట్టి తరలింపు వద్దన్నందుకు కర్రలతో దాడి చేసిన ఘటన మండలంలో చర్చనీయాంశంగా మారింది. అనుమతి లేకుండా మట్టి తరలించడమే కాకుండా అధికారులకు సమాచారం ఇచ్చాడన్న అనుమానంతో దాడికి తెగబడ్డారు. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన వేముల గురువయ్య, అతని కుమారులు మహేశ్, ప్రశాంత్ మంగళవారం పైడిపెల్లి శివారులోని చెరువు నుంచి ఎనగందుల రమేశ్ పొలం మీదుగా జేసీబీ సహాయంతో మట్టిని అక్రమంగా తరలించారు. తన పొలం నుంచి ట్రాక్టర్లు నడిపితే పొలం పాడవుతుందని రమేశ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ విషయమై మాట్లాడుదాం రమ్మని రమేశ్ను పిలిచి గురువయ్యతోపాటు ఆయన కుమారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రమేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు గురువయ్య, మహేశ్, ప్రశాంత్పై కేసు నమోదు చేసినట్లు ఇన్చార్జి ఎస్సై శ్రీధర్రెడ్డి తెలిపారు.