వర్షాకాలం.. వ్యాధుల భయం | - | Sakshi
Sakshi News home page

వర్షాకాలం.. వ్యాధుల భయం

Jun 26 2025 6:15 AM | Updated on Jun 26 2025 6:15 AM

వర్షా

వర్షాకాలం.. వ్యాధుల భయం

● జిల్లాలోని పట్టణాల్లో మినీ డంప్‌యార్డులను తలపిస్తున్న ఓపెన్‌ప్లాట్లు ● కాలనీల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త ● స్వైర విహారం చేస్తున్న పందులు, కుక్కలు ● విజృంభిస్తున్న దోమలు ● పొంచి ఉన్న సీజనల్‌ వ్యాధులు

కరీంనగర్‌ కార్పొరేషన్‌/కరీంనగర్‌టౌన్‌/జమ్మికుంట/చొప్పదండి: వర్షాకాలం ప్రారంభమైంది. అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో మార్పు, పారిశుధ్యం, ఆహారం, తదితర కారణాలతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఖాళీ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండడంతో దోమల బెడద పెరుగుతోంది. పందులు స్వైర విహారం చేస్తున్నాయి. వర్షాలు పెరిగితే సీజనల్‌ వ్యాధులతో పాటు డెంగీ, మలేరియా, విషజ్వరాలు, డయేరియా ప్రబలే ప్రమాదం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిక్కిరిస్తుంటాయి. ప్రజలు ఈ విషయమై ముందు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో నగరపాలక సంస్థ, మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోని ఓపెన్‌ ప్లాట్లు మినీ డంప్‌యార్డులను తలపిస్తున్నాయి. మున్సిపల్‌, వైద్యఆరోగ్యశాఖ అధికారులు సంయుక్తంగా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయా పట్టణ ప్రజలు కోరుతున్నారు.

కరీంనగర్‌లోని హుస్సేనిపుర 9వ వీధిలో పరిస్థితి ఇది. అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌కు సమీపంలో ఉన్న ఈ వీధిలోని ఓ ఖాళీ స్థలంలో చెత్తచెదారం వేస్తుండడంతో మినీ డంప్‌యార్డ్‌లా మారింది. ముళ్లచెట్లు, పొదలు విపరీతంగా పెరిగాయి. ఇక్కడే ప్లాస్టిక్‌కవర్లు, చెత్తాచెదారం పడేస్తున్నారు. రోజుల తరబడి చెత్తాచెదారం అలానే ఉండడంతో ఈ ప్రాంత వాసులు రోగాలబారిన పడే ప్రమాదం ఉంది.

ఇది జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు వీరు. ప్రస్తుతం ఓపీ, ఐపీ కేసులు మామూలుగానే ఉన్నాయి. ఇంకా సీజనల్‌ వ్యాధులు ప్రారంభం కాకపోవడంతో జ్వర బాధితులు పెద్దగా ఆసుపత్రికి రావడం లేదు. గత జ్వరాల సీజన్‌లో 1000కి పైగా ఓపీ కేసులు, ప్రతిరోజు 150కి పైగా ఐపీ కేసులు ఉండేవి. ప్రస్తుతం ఓపీ 450, ఐపీ 50కి మించడం లేదు.

వర్షాకాలం.. వ్యాధుల భయం1
1/2

వర్షాకాలం.. వ్యాధుల భయం

వర్షాకాలం.. వ్యాధుల భయం2
2/2

వర్షాకాలం.. వ్యాధుల భయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement