
జింక్ కార్నర్ ప్రారంభం
కరీంనగర్టౌన్: స్టాప్ డయేరియా కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో ఓఆర్ఎస్, జింక్ కార్నర్ను డీఎంహెచ్వో వెంకటరమణ ప్రారంభించారు. చిన్నపిల్లల వార్డును పరిశీలించి పిల్లల అనారోగ్య సమస్యలను తెలుసుకున్నారు. వారికి అందుతున్న చికిత్సలపై ఆ రా తీశారు. ఆర్బీఎస్కే కార్యక్రమంలో నడుస్తున్న డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో పోషకాహార పునరావాసకేంద్రాన్ని సందర్శించి, సిబ్బంది హాజ రు పట్టిక, రికార్డులను పరిశీలించారు. ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాజిదా, పిల్లల వైద్యులు కల్యాణి, పవిత్ర, సరస్వతి పాల్గొన్నారు.
‘ఎమ్మెల్యే గంగులను విమర్శిస్తే సహించం’
కరీంనగర్: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను విమర్శించే నైతిక అర్హత మాజీ మేయర్ సునీల్రావుకు లేదని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ స్పష్టం చేశారు. బుధవారం మీసేవ కార్యాలయంలో మాట్లాడుతూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగుతూ పదవులు పొంది అక్రమ సంపాదన, అడ్డగోలు అవినీతికి పాల్పడిన సునీల్రావుకు బీఆర్ఎస్ను, గంగులను విమర్శించే అర్హత లేదన్నారు. మేయర్గా ఉన్నన్ని రోజులు కేంద్ర మంత్రి బండి సంజయ్పై అనేక విమర్శలు చేసిన సునీల్రావు నేడు పొగుడుతుండడం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో లబ్ధిపొందేందుకేనని ఆరోపించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు కార్పొరేటర్గా కమలాకర్ ప్రజల మన్ననలు పొంది వేల కోట్ల నిధులతో కరీంనగర్ రూపురేఖలను మార్చారన్నారు.
దరఖాస్తులు ఆహ్వానం
కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాల కరీంనగర్ బాయ్స్–3లో జూనియర్ లెక్చరర్, ఎలక్ట్రికల్ టెక్నిషియన్–2, చొప్పదండి గర్ల్స్–1లో పీజీటీ ఉర్దూ–1(మహిళ అభ్యర్థుల)ఔట్సోర్సింగ్ విధానంలో పని చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జి ల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి పవన్కుమా ర్ ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ లెక్చరర్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ అభ్యర్థికి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో బీటెక్ అర్హత ఉండాలని, ఎలక్ట్రికల్లో ఏఎంఐఈ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా గుర్తింపు పొందిన అర్హ త ఉండాలని, పీజీటీ ఉర్దూ కోరకు సంబంధిత సబ్జెక్టుతో పీజీ ఉన్న మహిళా అభ్యర్థులు బీఈ డీ కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులను జిల్లా మైనారిటీస్ సంక్షేమ కార్యాలయంలో ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని పేర్కొన్నారు. వివరాలకు 08782957085 నంబర్ను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ అభివృద్ధి పనులు చేపడుతున్నందున గురువారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు 11 కె.వీ.తీగలగుట్టపల్లి ఫీడర్ పరిధిలోని తీగలగుట్టపల్లి, సరస్వతీనగర్, విద్యారణ్యపురి, మాణికేశ్వర్నగర్, హుస్సేనిపుర, నాకా చౌరస్తా, గాంధీచౌరస్తా, డీసీఎంఎస్, సాహెత్పురా ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్– 1 ఏడీఈ పంజాల శ్రీనివా స్గౌడ్ తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి 3.30 గంటల వరకు రేకుర్తి ఫీడర్ పరిధిలోని రేకుర్తి, రేకుర్తి పాతవాడ, సాసలెహ్నగర్, విజయపురికాలనీలో సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు పేర్కొన్నారు.