
అధికారుల దృష్టికి రైల్వే సమస్యలు
రామగుండం: దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ రైల్ నిలయంలో మంగళవారం డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (డీఆర్యూసీసీ) ప్రతినిధులో డీఆర్ఎం, డీఆర్యూసీసీ చైర్మన్ భరతేష్కుమార్జైన్ సమావేశం నిర్వహించారు. రామగుండం నుంచి డీఆర్యూసీసీ ప్రతినిధి అనుమాస శ్రీనివాస్ హాజరై పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా నాగపూర్–కాజీపేట ప్యాసింజర్ రైలును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దీంతో ఈనెల 27వ తేదీ నుంచి పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు సమాధానమిచ్చారు. రైలు నంబరు 17035/36 అజ్నీ– కాజీపేట (కాజీపేట–బల్హర్షా ఎక్స్ప్రెస్) రైలు సమయం మార్చి భద్రాచలం లేదంటే సికింద్రాబాద్ వరకు పొడిగించాలని, చైన్నె–అహ్మదాబాద్ నవజీవన్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, చైన్నె–జైపూర్ రైలుకు రామగుండంలో హాల్టింగ్ కల్పించాలని, ఎల్సీ నంరు 49 రామగుండం–రాఘవపూర్ స్టేషన్ల మధ్య కుందనపల్లి వద్ద మూడు రైల్వేగేట్ల వద్ద వంతెన నిర్మించాలని కోరారు. అధికారులు సమాధానమిస్తూ, వంతెన నిర్మాణ ప్రక్రియ టెండరు ప్రక్రియలో ఉందన్నారు. డీఆర్యూసీసీ కార్యదర్శి, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సఫాలీ, ఏడీఆర్ఎం గోపాలకృష్ణ తదితరులున్నారు.