
పచ్చని చెట్లపై గొడ్డలి వేటు
వన సంపద కరువై పర్యావరణం ప్రమాదంలో పడుతుండగా దుకాణదారుల వికృత చేష్టలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం హరితహారం పేరుతో మొక్కలను నాటిస్తుండగా దుకాణాల పేర్లు కనిపించడం లేదని, గిరాకీ దెబ్బతింటుందని కొందరు వ్యాపారులు పచ్చని చెట్లను నరికేస్తున్నారు. నగరంలోని కలెక్టరేట్ దారితో పాటు మంకమ్మతోట, భగత్నగర్, కట్టరాంపూర్ తదితర దారుల్లో ఇదే పరిస్థితి. బల్దియా అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని సిటీ ప్రజలు కోరుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్