
టౌన్ ప్లానింగ్ ఫిర్యాదులకు స్పెషల్ డెస్క్
● నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్
కరీంనగర్కార్పొరేషన్: పట్టణ ప్రణాళిక విభాగానికి (టౌన్ప్లానింగ్) సంబంధించిన ఫిర్యాదుల కోసం కార్యాలయంలో స్పెషల్ డెస్క్ను ఏర్పాటు చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. మంగళవారం టౌన్ప్లానింగ్ విభాగం అధికారులతో తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టౌన్ప్లానింగ్కు సంబంధించి ప్రతిరోజు వచ్చే ఫిర్యాదుల కోసం స్పెషల్ డెస్క్ను ఏర్పాటు చేయాలన్నారు.వచ్చిన ఫిర్యాదులకు నంబర్లు వేసి రికార్డు పాటించాలన్నారు. నగరంలో ఆక్రమణలపై దృష్టి పెట్టాలన్నారు. డీఆర్ఎఫ్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎక్కడ ఆక్రమణలు ఉన్నా తొలగించాలన్నారు. అనుమతి లేని నిర్మాణాల డాక్యుమెంట్స్ కాల్ఫర్ చేసి షోకాజు ఇవ్వాలన్నారు. గతంలో షోకాజు నోటీసులు జారీ చేసిన వాటి పై వెంటనేచర్యలు తీసుకోవాలన్నారు. భవన నిర్మాణ అనుమతులు పెండింగ్లో పెట్టొద్దని, నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్నకేసులను మూడు రోజుల్లో పరిష్కరించాలన్నారు. రోజుల కొద్ది ఫ్లెక్సీలను ఉంచొద్దని, వాటిని తొలగించాలని అన్నారు. డీసీపీ బషీరొద్దిన్, ఏసీపీలు శ్రీధర్, వేణుమాధవ్, టీపీఎస్ సంధ్య, రాజ్కుమార్, తేజస్విని పాల్గొన్నారు.
డంప్యార్డ్ సమస్య పరిష్కారానికి చర్యలు
నగరంలోని డంప్యార్డ్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. నగరంలోని జ్యోతిబాపూలేపార్క్ను, మంచిర్యాల చౌరస్తా, ఆదర్శనగర్లో పారిశుధ్య పనులను మంగళవారం తనిఖీ చేశారు. పరిసరాల్లో చెత్త వేసిన మెడికల్ షాప్ల నిర్వాహకులకు జరిమానా విధించాలని ఆదేశించారు. డంప్యార్డ్ కోసం మల్కాపూర్, చింతకుంట ప్రాంతాల్లో స్థలాలు పరిశీలించారు. చింతకుంట, మల్కాపూర్ డంప్యార్డ్లను సర్వే చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించామన్నారు. సర్వే పూర్తి చేసి డంప్యార్డ్ విస్తీర్ణ వివరాలు అందించంతో పాటు, హద్దులు నిర్ణయించాలన్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడవేస్తే జరిమానా విధించాలన్నారు. డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్, పర్యావరణ ఇంజినీర్ స్వామి పాల్గొన్నారు.