
సెల్ఫోన్ వెలుగులో అంత్యక్రియలు
కరీంనగర్ కార్పొరేషన్: నగరశివారులోని కేబుల్ బ్రిడ్జి వైకుంఠధామంలో రాత్రి వేళ లైట్లు వెలగడం లేదు. ఫలితంగా చీకట్లో అంత్యక్రియలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నెల 23న నగరానికి చెందిన శశికళ, సత్యనారాయణ అనే వ్యక్తులు మృతి చెందగా, వారి అంత్యక్రియలను బంధువులు కేబుల్ బ్రిడ్జి సమీపంలోని వైకుంఠధామంలో నిర్వహించారు. వైకుంఠధామంలో లైట్లు లేకపోవడంతో సెల్ఫోన్ టార్చి వెలుగుల్లో అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. స్మార్ట్సిటీ నిధులతో అన్ని హంగులతో నిర్మించిన శ్మశాన వాటికలో కనీసం లైట్లు వెలగకపోవడం నిర్వహణ లోపాన్ని చూపుతోందని మాజీ కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ సోహాన్ సింగ్ అన్నారు. వైకుంఠధామంలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని నగరపాలకసంస్థ కమిషనర్ను కోరారు.
● కేబుల్ బ్రిడ్జి వైకుంఠధామంలో చీకట్లు