
రైతు వేదికలకు డబ్బులు
● విడుదల చేసిన వ్యవసాయ శాఖ
సాక్షిప్రతినిధి,కరీంనగర్: రైతు భరోసా నిధులు వి డుదల సందర్భంగా రైతు వేదికల వద్ద సంబరాల కోసం ఎట్టకేలకు నిధులు విడుదలయ్యాయి. వాస్తవానికి రైతు భరోసా ప్రారంభం, ముగింపు సందర్భంగా రైతు వేదికల వద్ద సీఎంతో ముఖాముఖి కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతీ రైతు వేదికకు 200 మంది రైతులను తరలించాలని ఏఈవోలకు టార్గెట్లు విధించింది. ఇటీవల జరిగిన కార్యక్రమానికి రైతులను తరలించడం, వారికి టీ, స్నాక్స్ ఖర్చులను భరించడం వంటి పనులు ఏఈవోలే చూసుకున్నారు. తాజాగా ముగింపు వేడుకులకు సైతం ఏఈవోలు నిర్వహించాలని చెప్పడంతో వారంతా తలలు పట్టుకున్నారు. గత వేడుక డబ్బులే రాకపోగా, మరోసారి చేతి నుంచి డబ్బులు ఎలా పెట్టుకోవాలో తెలియక సతమతమయ్యారు. ఈ విషయాన్ని మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘అన్నదాతా.. రైతువేదికకు రావా?’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. మంగళవారం మధ్యాహ్నం అన్ని రైతు వేదికల వద్ద సంబరాలు నిర్వహించేందుకు ఏఈవోలకు కావాల్సిన నిధులు విడుదల చేసింది.

రైతు వేదికలకు డబ్బులు