ఎల్లారెడ్డిరూరల్: సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం రద్దు చేయాలని ఎండీఎం నిర్వాహకులు మంగళవారం ఆర్డీవో ప్రభాకర్ను కోరారు. ఈమేరకు వినతిపత్రం అందించారు. 2023–24 సంబంధించిన అల్పాహారం పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, త్వరలోనే ప్రారంభించనున్న అల్పాహార పథకాన్ని వంట కార్మికులతోనే నిర్వహించాలని, అల్పాహారానికి సంబంధించి విధివిధానాలు ప్రకటించాలని, గ్యాస్ సహా వంట పథకానికి సరుకులు మొత్తం ప్రభుత్వమే సరఫరా చేయాలని విన్నవించారు. సుజాత, హేమలత, అంబవ్వ, లావణ్య, తదితరులు ఉన్నారు.


