మాచారెడ్డి: పాల్వంచ మండలం బండ రామేశ్వరపల్లిలో శుక్రవారం గ్రామస్తులు పోచమ్మ పండుగ చేసుకున్నారు. అలంకరించిన బోనాలతో మహిళలు ఊరేగింపుగా వచ్చి పోచమ్మకు సమర్పించారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా పడాలని, పంటలు బాగా పండాలని మొక్కులు తీర్చుకున్నారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): ధర్మారావ్పేట్లో శుక్రవారం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో వర్షాలు సమద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని వేడుకుంటూ గంగమ్మ తల్లికి బోనాలను ఊరేగించారు. ఈ సందర్భంగా ముందుగా గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేసి బోనాలను ఊరేగించారు.


