ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని కౌన్సిలర్ దశరథం అన్నారు. శుక్రవారం ఆయన కాలనీవాసులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మదన్మోహన్ సహకారంతో కాలనీని అభివృద్ధి చేస్తానని అన్నారు. వర్షాకాలంలో రోడ్డుపై, గుంతలలో నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎల్లమ్మ గుడి ప్రాంగణంలో మొరం మట్టి వేసి ఆలయం చుట్టూ నీరు లేకుండా చర్యలు తీసుకున్నారు.
బీబీపేటలో..
కాటేపల్లి గ్రామంలో..


