ఎల్లారెడ్డిరూరల్: వెంకటాపూర్ అగ్రహారాన్ని శుక్రవారం తహసీల్దార్ ప్రేంకుమార్ సందర్శించారు. భూమి ఉన్నా హక్కు లేదాయే శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్ర చురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడు తూ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ భూమి ఎండోమెంట్కు సంబంధించినదని నోటీసులు ఇవ్వడంతో కొత్త పట్టా పాస్ బు క్కులు జారీ కాలేదన్నారు. ఈ భూములపై ఉ మ్మడిగా విచారణ జరపాలని దేవాదాయ శా ఖ కమిషనర్కు ప్రతిపాదనలు పంపామన్నా రు. విచారణ అనంతరం ఉన్నతాధికారుల సూచన మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.


