
బైక్ను ఢీకొన్న స్కూల్ బస్సు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్పేటలోని నల్లపోచమ్మ ఆలయం వద్ద ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు శుక్రవారం ఓ బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న మండలంలోని తాటిచెట్టుగడ్డతండాకు చెందిన అంగోత్ దేవిసింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే దేవిసింగ్ను చికిత్స నిమిత్తం గోపాల్పేటలోని ఓ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యుల సూచనల మేరకు కామారెడ్డిలోని ఆస్పత్రికి తరలించారు. స్కూల్ బస్సుతోపాటు బైక్ను స్థానిక పోలీసులు నాగిరెడ్డిపేట పోలీస్స్టేషన్కు తరలించారు. ప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.