
పాఠశాలకు లేటుగా వచ్చారని గేటుకు తాళం
తాడ్వాయి(ఎల్లారెడ్డి): పాఠశాలకు లేటుగా వచ్చారని విద్యార్థులతో పాఠశాల సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. గేటుకు తాళం వేసి విద్యార్థులు, తల్లిదండ్రులను లోనికి రానివ్వలేదు. వివరాలు.. తాడ్వాయి బాలికల గురుకుల పాఠశాలకు ఈనెల 15న విద్యార్థులను తీసుకురావాలని తల్లిదండ్రులకు పాఠశాల సిబ్బంది తెలిపారు. కానీ తల్లిదండ్రులు 5 రోజులు లేటుగా తమ పిల్లలను గురుకుల పాఠశాలకు తీసుకొచ్చారు. దీంతో లేటుగా వచ్చారనే కోపంతో గురుకుల పాఠశాల సిబ్బంది కనీసం గేటు కూడా తీయలేదు. దీంతో మండుటెండలో విద్యార్థులు, తల్లిదండ్రులు గంటల తరబడి గేటు ముందు నిలబడాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి సిబ్బంది, తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాల గేటు తాళం తీయించి విద్యార్థులను లోపలికి పంపించారు.
బయట ఎండలోనే ఉండిపోయిన
విద్యార్థులు, తల్లిదండ్రులు
పోలీసులు సముదాయించడంతో గేటు
తాళం తీసిన పాఠశాల సిబ్బంది