
మద్యం అమ్మితే చెప్పుదెబ్బలు
రాజంపేట: పచ్చని పల్లెల్లో చిచ్చుపెడుతున్న మద్యం రక్కసికి చెక్ పెట్టేందుకు గుండారం, నడిమితండా, ఎల్లాపూర్ తండాలవాసులు ఒక్కటయ్యారు. శుక్రవారం మూడు గ్రామాల ప్రజలు గుండారం ఎల్లమ్మ గుడి వద్ద సమావేశమై తమ గ్రామాలలో మద్యం విక్రయాలను నిషేధిస్తూ తీర్మానం చేశారు. తమ గ్రామాల పరిధిలో మద్యం అమ్మితే రూ. లక్ష జరిమానాతో పాటు ఏడు చెప్పు దెబ్బలు శిక్ష విధించాలని నిర్ణయించారు. మద్యం అమ్మిన వారిని పట్టించినవారికి రూ. 20 వేల బహుమతి అందిస్తామని తెలిపారు.
లక్ష రూపాయల జరిమానా
తీర్మానించిన మూడు గ్రామాల ప్రజలు