
ఆరోగ్య యోగం
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
శనివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లో u
● పెరుగుతున్న అవగాహన
● శారీరక, మానసిక దారుఢ్యానికి ఎంతో ఉపయుక్తం
● జీవితంలో భాగమైన యోగా
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఉరుకులు, పరుగుల జీవితంలో చాలామంది మూడు పదుల వయసులోనే అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. బీపీ, షుగర్ పేషెంట్ల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. గుండెపోట్లకు వయసుతో సంబంధం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్తోపాటు వివిధ రకాల వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు యోగాపై ఆసక్తి చూపుతున్నారు. కనీసం అరగంట పాటు యోగాసనాలు వేస్తే ఏ సమస్య రాదనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది.
మండలాల్లోనూ యోగా కేంద్రాలు..
కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాలు, వివిధ మండలాల్లోనూ యోగా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. యోగాలో ప్రావీణ్యం పొందిన గురువులు చాలా మందికి ఉచితంగా శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. అంతేగాక స్కూళ్లలోనూ యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. పిల్లలతో యోగాసనాలు వేయిస్తూ వారిని వివిధ స్థాయిల్లో పోటీలకు పంపుతున్నారు. ప్రభుత్వం సైతం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా ఇన్స్ట్రక్టర్లను నియమించి ప్రజలకు యోగా నేర్పిస్తోంది.
అన్ని వర్గాల్లోనూ ఆసక్తి...
గతంలో ఉద్యోగులు, వ్యాపారులు కొద్దిమంది మాత్రమే యోగా చేసేవారు. అయితే యోగాతో కలిగే ప్రయోజనాలను గుర్తించి చాలా మంది ఆసనాలవైపు మళ్లారు. చాలాచోట్ల యోగా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అందుబాటులో కేంద్రాలు ఏర్పాటు కావడంతో అక్కడికి వెళ్లి యోగా నేర్చుకుంటున్నారు.
న్యూస్రీల్
ఆధునిక ప్రపంచంలో జీవన విధానంలో వేగం పెరిగింది. పోటీ ప్రపంచంలో ఒత్తిడి సర్వసాధారణంగా మారింది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒత్తిడిని చిత్తు చేయడానికి యోగాను ఆశ్రయిస్తున్నారు. నిత్య జీవితంలో భాగంగా మార్చుకుంటున్నారు. పలువురు దశాబ్దాలుగా యోగా వ్యాప్తికి కృషి చేస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలో యోగా వ్యాప్తికి కృషి చేసిన పలువురిపై కథనం..

ఆరోగ్య యోగం