
‘యోగా డే’కు ఆహ్వానం
కామారెడ్డి అర్బన్: జిల్లాలోని పలు ప్రాంతాలలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఆయుష్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించనున్నట్లు ఆయుష్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ఆకుల శ్రీకాంత్ తెలిపారు. శుక్రవారం కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని కలిసి యోగా డేలో పాల్గొనాలంటూ ఆహ్వాన పత్రిక అందించారు. యోగా డే సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఎమ్మెల్యేకు వివరించారు. ఆయన వెంట ప్రకృతి వైద్యులు దేవయ్య, ఆయుర్వేద వైద్యులు వెంకటేశ్వర్లు ఉన్నారు.
నిర్వహించే ప్రాంతాలు..
● ఆయుష్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాలలో యోగా డే నిర్వహించనున్నట్లు ఆయుష్ డీపీఎం శ్రీకాంత్ తెలిపారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు శ్రీసరస్వతి విద్యామందిర్లో యోగా డే నిర్వహిస్తామని పేర్కొన్నారు.
● 8.30 గంటల 9.30 వరకు లింగంపేట నాగన్నబావి వద్ద నిర్వహించే కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొంటారని తెలిపారు.
● యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా యోగా భవన్లో ఉదయం 5.30 నుంచి 7.15 వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.
● జిల్లాకేంద్రంలోని ఆర్యసమాజ్లో 8 గంటలకు బీజేపీ ఆధ్వర్యంలో, మెహర్ బాబా ఫంక్షన్ హాల్లో యోగా గురువు బండి రాములు ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటలకు యోగా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.