పిచ్చుకలంక టూరిజం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించాం. కానీ ఆ ఆశలు నెరవేరలేదు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి టూరిజం ప్రాజెక్టును అభివృద్ధి చేయాలి.
– కుండ అన్నపూర్ణ,
ఆత్రేయపురం మండల పరిషత్ అధ్యక్షురాలు
అభివృద్ధి చేయాలి
పిచ్చుకలంకను అభివృద్ధి చేస్తే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలందరికి టూరిస్ట్ ప్రదేశంగా మారుతుంది. కూటమి నేతలు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ టూరిజం ప్రాజెక్టును అభివృద్ధి చేయాలి. రాబోయే గోదావరి పుష్కరాల నాటికై నా పూర్తి చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
– గొట్టుముక్కల గోపాలకృష్ణంరాజు (గోపి),
వైఎస్సార్ సీపీ ప్రైవేటు ఉపాధ్యాయ సంఘాల నేత


