
నీట్లో మెరిసిన ముత్యం
పెద్దాపురం: నీట్ ఫలితాల్లో కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తిరుపతి గ్రామానికి చెందిన మాసా యామిని సౌమ్యశ్రీ ప్రతిభ చాటింది. రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో తొలి ప్రయత్నంలోనే ఆమెకు సీటు దక్కింది. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయం ఆదివారం ప్రకటించిన నీట్ ఫలితాల్లో ఈ మేరకు ఆమె ఉచిత సీటును దక్కించుకుంది. యామిని డాక్టర్ కావాలనే లక్ష్యంతో విద్య కొనసాగించింది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఈడుపుగల్లు ఐఐటీ నీట్ అకాడమీలో ఆమె ఇంటర్తో పాటు ప్రత్యేక శిక్షణ పొందింది. తండ్రి మాసా చంద్రరావు పారా లీగల్ అడ్వయిజర్ కాగా, తల్లి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తుంది. యామిని తన లక్ష్యాన్ని చేరుకోవడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.