నది నీరు వస్తేనే.. | - | Sakshi
Sakshi News home page

నది నీరు వస్తేనే..

Aug 27 2026 12:54 AM | Updated on Aug 27 2026 12:54 AM

సోమవారం రాత్రి ఆర్డీఎస్‌ ఆనకట్ట వరకు వరద వచ్చిందని అధికారులు అంటున్నారు. ఎగువ ప్రాంతంలో తెలిసిన వారిని అడిగితే మాధవరం దగ్గరలో కొద్దిపాటి వరద నీరు వస్తుందని, మా దాకా వచ్చేందుకు మరో నాలుగు రోజులు పట్టొచ్చన్నారు. మిరప, వరి సాగు చేశాను. నదికి నీరు వస్తేనే పంటలు బతుకుతాయి.

– విక్రమ్‌సింహారెడ్డి, రైతు, చిన్న ధన్వాడ

తుమ్మిళ్ల సమాచారం కోసం..

తుమ్మిళ్లలో మోటార్‌ ఆన్‌ చేస్తేనే ఆర్డీఎస్‌ కెనాల్‌కు నీరు అందుతుంది. దాని కోసం రోజూ విలేకరులు, నాయకులకు ఫోన్‌ చేస్తున్నాం. ప్రస్తుతం తడులు అందకుంటే పంటకు ఉన్న కొద్ది ప్రాణం కూడా పోతుంది. నదికి నీరు వచ్చి తుమ్మిళ్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారనే సమాచారం కోసం ఎదురుచూస్తున్నాం. – గోపాల్‌,

గోకులపాడు, మానవపాడు మండలం

ఎలాంటి సమాచారం లేదు

గువ నుంచి నీరు వస్తున్నట్లు మాకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం నదిలో నీరు అడుగంటింది. తుమ్మిళ్ల మోటార్‌కు కూడా అందవు. టీబీ డ్యాంలో నిల్వలు తప్ప మిగతా ఎలాంటి సమాచారం లేదు. ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే రైతులకు తెలియచేస్తాం. – రామదాసు, ఆర్డీఎస్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement