
21 రోజుల్లో ముగ్గురి మృతి
● రాచర్లబొప్పాపూర్లోని ఆ కుటుంబంలో తీవ్ర విషాదం ● ఒంటరివారైన తల్లీకొడుకులు
ఎల్లారెడ్డిపేట(ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్లో ఆ కుటుంబంలో 21 రోజులుగా విషాదచాయలు వీడడం లేదు. ఒకరి తర్వాత ఒకరిగా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు గడ్డి నర్సయ్య, ఆయన కుమారుడు నరేందర్, తల్లి ఎల్లవ్వ మరణాలతో నర్సయ్య భార్య, కొడుకు ఒంటరివారయ్యారు.
మూడు వారాల్లోనే ముగ్గురు
రాచర్లబొప్పాపూర్కు చెందిన గడ్డి నర్సయ్య(55) తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. అయితే ఏప్రిల్ 3వ తేదీన అనారోగ్యంతో మరణించాడు. అతని చిన్న కొడుకు నరేందర్(23) ఓ మహిళతో ప్రేమలో పడి, 45 రోజులు జైలు జీవితం గడిపాడు. తండ్రి చనిపోవడంతో బెయిల్పై బయటకు వచ్చాడు. అయితే తన తండ్రి మృతికి సదరు మహిళే కారణమంటూ ఆమె ఇంటికి వెళ్లి గొడవపడి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఈనెల 22న ప్రాణాలు కోల్పోయాడు. తన కళ్ల ముందే కన్నకొడుకు, మనుమడు మృతిచెందడంతో నర్సయ్య తల్లి గడ్డి ఎల్లవ్వ(80) తీవ్ర మనోవేదనకు గురైంది. గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. వారి కుటుంబంలో 21 రోజుల వ్యవధిలోనే ముగ్గురు మరణించడం కలచివేసింది. ప్రస్తుతం వారి కుటుంబంలో నర్సయ్య భార్య, కొడుకు ఒంట రివారయ్యారు. వారి వేదన వర్ణనాతీతంగా ఉంది.

21 రోజుల్లో ముగ్గురి మృతి

21 రోజుల్లో ముగ్గురి మృతి