
ఉక్రెయిన్ తన 34వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలోనే రష్యాపై దాడులకు దిగింది. కుర్స్క్లోని అణు విద్యుత్ ప్లాంట్పై డ్రోన్ దాడులు చేసినట్లు రష్యా ఆరోపించింది. ఈ దాడుల్లో ప్లాంట్ ట్రాన్స్ఫార్మర్ దెబ్బతిన్నా, రేడియేషన్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని అధికారులు తెలిపారు.
రాత్రి సమయంలో ఉక్రెయిన్ ఇంధన, విద్యుత్ ప్లాంట్లపై అనేక దాడులు జరిపింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, 95 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు పేర్కొంది. అదే సమయంలో, రష్యా కూడా 72 డ్రోన్లు, ఒక క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించింది, వాటిలో 48 డ్రోన్లను ఉక్రెయిన్ వైమానిక దళం నాశనం చేసింది
ఈ దాడుల నేపథ్యంలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇండిపెండెన్స్ స్క్వేర్ నుంచి వీడియో సందేశం ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, భద్రత, శాంతియుత జీవితం సాధ్యమయ్యే భవిష్యత్తును నిర్మిస్తున్నామని చెప్పారు. అంతేకాక, కెనడా ప్రధాని కీవ్కు చేరుకుని జెలెన్స్కీని కలిశారు. నార్వే కూడా ఉక్రెయిన్కు సుమారు 695 మిలియన్ డాలర్ల సైనిక సహాయం ప్రకటించింది.
ఉక్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం వేళ జరిగిన ఈ ఘటనలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి.