
పశ్చిమ ఆఫ్రికా దేశంలోని ఘనాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. దాంతో ఆ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. బుధవారం జరిగిన ఈ విషాద సంఘటనలో మరణించిన ఎనిమిది మందిలో రక్షణ మంత్రి ఎడ్వర్డ్ ఒమానే బోమా మరియు పర్యావరణ మంత్రి ఇబ్రహీం ముర్తాలా ముహమ్మద్ ఉన్నారు.
ఘనా సాయుధ దళాల ప్రకారం, Z-9 యుటిలిటీ హెలికాప్టర్ బుధవారం ఉదయం రాజధాని నగరం అక్ర నుండి బయలుదేరింది. అక్కడ నుండి అశాంతి ప్రాంతంలోని కీలకమైన బంగారు గనుల పట్టణం ఒబువాసి వైపు వెళుతుండగా రాడార్ సిగ్నల్స్ తెగిపోయినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనను అక్కడి ప్రభుత్వం "జాతీయ విషాదం"గా ప్రకటించింది.అయితే ఈ ప్రమాదానికి గల ఇతర కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.