డాక్టర్‌ శ్రీపూజకు జేసీఐ ‘ఎక్సలెన్స్‌’ అవార్డు | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ శ్రీపూజకు జేసీఐ ‘ఎక్సలెన్స్‌’ అవార్డు

Nov 14 2024 9:04 AM | Updated on Nov 14 2024 9:04 AM

డాక్టర్‌ శ్రీపూజకు జేసీఐ ‘ఎక్సలెన్స్‌’ అవార్డు

డాక్టర్‌ శ్రీపూజకు జేసీఐ ‘ఎక్సలెన్స్‌’ అవార్డు

సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ప్రముఖ క్లినికల్‌ సైకాలజిస్ట్‌ డాక్టర్‌ శ్రీపూజ సిద్ధంశెట్టికి జేసీఐ అలుమ్ని క్లబ్‌ వారి ప్రతిష్టాత్మక ఎక్సలెన్స్‌ అవార్డు లభించింది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె అవార్డు అందుకున్నారు. విద్య, ఆరోగ్యం, క్లినికల్‌ సైకాలజీలో ఎంతో పేరొందిన డాక్టర్‌ శ్రీపూజ సిద్ధం శెట్టి సేవలను గుర్తించి జేసీఐ అలుమ్ని క్లబ్‌ వారు ప్రతిష్టాత్మక ఎక్సలెన్స్‌ అవార్డును ప్రదానం చేశారు. జూనియర్‌ ఛాంబర్‌ ఇంటర్నేషనల్‌ అలుమ్ని క్లబ్‌ (జేసీఐ) వారు సమాజాభివృద్ధికి, మానవాళికి మేలు చేసే వారికి ఈ అవార్డును అందిస్తుంటారు. జోన్‌ బోర్డు మెంబర్‌గా ఆమె చేసిన విశేష కృషికి ఈ గుర్తింపు లభించింది. మైండ్‌ వెల్‌నెస్‌, విద్య, మానసిక ఆరోగ్యం విషయంలో పరిశోధనలు చేసి ఆయా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీపూజ శ్రీకారం చుట్టారు. ఇక ఇటీవల జరిగిన జేసీఐ అవార్డు ప్రదానోత్సవంలో జేసీఐ జాతీయ ప్రతినిధులు సునీల్‌కుమార్‌ రుమల్లా, వినయ్‌ మెహతా, మనోజ్‌ ఠాకర్‌, జోన్‌ చైర్మన్‌ జీవీఎన్‌. రాజు తదితరులు పాల్గొని ఆమెకు అవార్డు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement