తెలిసినవారే తెగించారు | - | Sakshi
Sakshi News home page

తెలిసినవారే తెగించారు

Jun 16 2025 7:15 AM | Updated on Jun 16 2025 7:15 AM

తెలిసినవారే తెగించారు

తెలిసినవారే తెగించారు

సామాజిక మాధ్యమాల్లో తొలుత పరిచయమయ్యారు. కొన్నాళ్లపాటు నమ్మకంగా మెలిగారు. ఆ తర్వాత తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. ఈ రెండు ఘటనల్లో మహిళలే బాధితులుగా మారారు. షాదీ డాట్‌కామ్‌ ద్వారా మహిళను పరిచయం చేసుకున్న వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లైంగిక దాడికి పాల్పడటంతో పాటు రూ.లక్షల్లో నగదు తీసుకుని మోసానికి పాల్పడ్డాడు. మరో ఘటనలో స్నాప్‌చాట్‌లో పరిచయమైన ఓ యువతిని వేధిస్తున్న వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు అందింది.

సనత్‌నగర్‌: షాదీ డాట్‌కామ్‌ ద్వారా ఓ మహిళను పరిచయం చేసుకున్నాడు..ఆపై పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి పలుమార్లు బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా రూ.లక్షల్లో నగదు తీసుకుని మోసానికి పాల్పడిన ఓ వ్యక్తిపై బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..బేగంపేట రసూల్‌పురాకు చెందిన మహిళ (47)కు వెస్ట్‌ ముంబైకి చెందిన కల్పేష్‌ కక్కడ్‌ (42) షాదీ డాట్‌కామ్‌లో పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఫేస్‌బుక్‌ రిక్వెస్ట్‌ పంపి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తనకు బాగా ఆస్తిపాస్తులు ఉన్నాయని, నమ్మబలికాడు. నగరానికి వచ్చి ఇక్కడే మకాం వేశాడు. ఈ క్రమంలో పలుమార్లు బలవంతంగా లైంగికదాడికి పాల్పడ్డాడు. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు అంటూ బాధితురాలితో పాటు ఆమె బంధువుల నుంచి రూ.22 లక్షల వరకు అప్పుగా తీసుకున్నాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు ముంబైకి పారిపోయాడు. బాధితురాలు ఫోన్‌ చేసి పెళ్లి విషయం, డబ్బు విషయం అడిగితే వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని, డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తే వీడియోలు, ఫొటోలను వైరల్‌ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోచారం: స్నాప్‌చాట్‌లో పరిచయమైన ఓ యువతిని వేధిస్తున్న వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాల్లోకి వెళితే..స్నాప్‌చాట్‌లో 2024 జూన్‌ నెలలో యాగిరెడ్డి అనిల్‌కుమార్‌కు ఓ మహిళ పరిచయమైంది. ఇరువురు ఆన్‌లైన్‌లో చాటింగ్‌ చేసుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆమె స్నాప్‌చాట్‌ లాగిన్‌లో సమస్య వచ్చింది. దీన్ని అనిల్‌ పరిష్కరిస్తానని ఆమె ఐడీ, పాస్‌వర్డ్‌ తీసుకున్నాడు. వీటిని వినియోగించి ఆమె వ్యక్తిగత ఫొటోలను సేకరించాడు. ఈ ఫొటోలను ఇతరులకు షేర్‌ చేస్తానని బెదిరించి విడతల వారీగా రూ.90 వేలు ఫోన్‌పే ద్వారా తీసుకున్నాడు. ఈ నెల 8వ తేదీన సంస్కృతి టౌన్‌షిప్‌లోని ఓ ఫ్లాట్‌కు రావాలని డిమాండ్‌ చేయడంతో ఆమె వెళ్లింది. అక్కడ ఆమైపె అనిల్‌ దాడి చేసి డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది కాలంగా ఆమెను అనిల్‌ ఇబ్బందిపెడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది.

సనత్‌నగర్‌ పరిధిలో..

అటు స్నాప్‌చాట్‌లో పరిచయమై వేధింపులు..

ఇటు షాదీ డాట్‌కామ్‌లో పరిచయమై..

మహిళపై లైంగిక దాడి..ఆపై బ్లాక్‌మెయిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement