సాక్షి,సిటీబ్యూరో: స్పెషల్ సమ్మరీ రివిజన్ కింద ఓటర్ల ముసాయిదా జాబితాను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ సోమవారం వెల్లడించారు. ముసాయిదా మేరకు జిల్లాలో 43,00,989 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 22,09,972 మంది కాగా, మహిళలు 20,90,727 మంది ఉన్నారు. ఇతరులు 290 మంది ఉన్నారు.
● జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను జూబ్లీహిల్స్లో అత్యధికంగా 3,56,995 మంది ఓటర్లుండగా, అత్యల్పంగా చార్మినార్ నియోజకవర్గంలో 2,16,648 మంది ఓటర్లున్నారు. మొత్తం 3986 పోలింగ్ కేంద్రాలున్నాయి.
అభ్యంతరాలుంటే తెలపండి:
ఓటరు ముసాయిదా జాబితాలు ఈఆర్ఓ( ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్)ల కార్యాలయాలతో పాటు ముఖ్యప్రాంతాల్లో అందుబాటులో ఉన్నట్లు రోనాల్డ్రాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ముసాయిదాలో తమ పేర్లు సరిచూసుకుని అభ్యంతరాలుంటే సంబంధిత ఈఆర్ఓలకు తెలియజేయాల్సిందిగా సూచించారు. ఆన్లైన్ ద్వారా కూడా అభ్యంతరాలను తెలపవచ్చునని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా ఓటర్లు 31,99,674
జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితాను ఎన్నికల కమిషన్ సోమవారం విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది నియోజకవర్గాలు ఉండగా, వీటి పరిధిలో మొత్తం 3,369 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసింది. మొత్తం 31,99,674 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. వీరిలో 16,62,692 మంది పురుషులు, 15,35,537 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇతరులు 384 మంది ఉన్నారు. వీరితో పాటు ఎన్ఆర్ఐ ఓటర్లు 195 మంది ఉండగా, సర్వీసు ఓటర్లు మరో 866 మంది ఉన్నారు.