ప్రణాళికాబద్ధంగా యూరియా పంపిణీ చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రణాళికాబద్ధంగా యూరియా పంపిణీ చేయాలి

Aug 21 2025 8:50 AM | Updated on Aug 21 2025 8:50 AM

ప్రణాళికాబద్ధంగా యూరియా పంపిణీ చేయాలి

ప్రణాళికాబద్ధంగా యూరియా పంపిణీ చేయాలి

ప్రణాళికాబద్ధంగా యూరియా పంపిణీ చేయాలి

వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట: జిల్లాలో యూరియా కొరత లేదని, సక్రమ పంపిణీ కోసం అధికారులు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులు, ఎరువుల కంపెనీల ప్రతినిధులు, డీలర్లతో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యూరియా పంపిణీలో భాగంగా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, జిల్లా అధికారులు రాంరెడ్డి, అనురాధ, నీరజ, కల్ప న తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో కాల్‌సెంటర్‌..

జిల్లాలో యూరియా పంపిణీ, ఇతర సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ సత్యశారద తెలిపారు. రైతుల సౌకర్యార్థం 18004253424 టోల్‌ ఫ్రీ నంబర్‌, 0870–2530812, 9154252936 నంబర్లలో సంప్రదించాలని ఆమె సూచించారు.

సుందరయ్యనగర్‌ పాఠశాల తనిఖీ..

గ్రేటర్‌ వరంగల్‌ పరిధి సుందరయ్యనగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ ఆకస్మికంగా సందర్శించారు. ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరును పరిశీలించారు. విద్యార్థులు సక్రమంగా చదవకపోవడంపై ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు ఓరియెంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని హెచ్‌ఎంను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సాంబశివరావు, డీఈఓ జ్ఞానేశ్వర్‌, తహసీల్దార్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ ఉన్నారు.

కీర్తినగర్‌ యూపీహెచ్‌సీ..

గీసుకొండ: 16వ డివిజన్‌ కీర్తినగర్‌లోని ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ సత్యశారద బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారాసిటమాల్‌ మాత్రలు ఎక్కువగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం మేరకు ఇండెంట్‌ పెట్టి తెప్పించుకోవాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement