మెలియాయిడోసిస్‌ | - | Sakshi
Sakshi News home page

మెలియాయిడోసిస్‌

Aug 27 2025 8:58 AM | Updated on Aug 27 2025 8:58 AM

 మెలి

మెలియాయిడోసిస్‌

● వర్షాకాలంలో కేసులు ఎక్కువగా నమోదు ● అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన ● జిల్లాలో కొత్తగా నాలుగు కేసులు నమోదు మెలియాయిడోసిస్‌ లక్షణాలు ● వ్యాధి సోకిన వారిలో దీర్ఘకాాలిక దగ్గు ఉంటుంది. ● అధిక జ్వరం, బరువు తగ్గడం, రాత్రి చెమటలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ● దగ్గితే రక్తం పడుతుంది. ● కడుపు లేదా ఛాతీ నొప్పి ఉంటుంది. ● కండరాలు, కీళ్ల నొప్పి, తలనొప్పి, మూర్ఛలు ఉంటాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

డయాబెటిస్‌, దీర్ఘకాలిక వ్యాధి బాధితులు మట్టి, నిలబడి ఉన్న నీటితో సంబంధాన్ని తగ్గించుకోవాలి.

తడి నేల, మురుగునీరు, బురదలో నడుస్తున్నప్పుడు జల నిరోధక బూట్లు ధరించాలి.

తోట పని, మట్టితో పని చేసేటప్పుడు చేతి తొడుగులు ధరించాలి.

గాయాలు లేదా పుండ్లపై వాటర్‌ ప్రూఫ్‌ కవరింగ్‌లను ఉపయోగించాలి.

గాయాలలోకి కలుషితమైన నీరు, మట్టిని పోకుండా చూసుకోవాలి.

మట్టిలో, బురద నీటిలో పని చేసిన తర్వాత స్నానం చేయాలి.

చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

పచ్చికను కోసేటప్పుడు, కలుపు మొక్కలను తొలగించేటప్పుడు, నేల చుట్టూ అధిక పీడన స్ప్రేని ఉపయోగిస్తున్నప్పుడు మాస్క్‌ ధరించాలి.

వర్షాకాలంలో కేసులు ఎక్కువ

అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకం

గుంటూరు మెడికల్‌: మెలియాయిడోసిస్‌ వ్యాధి మన దేశం సహా దక్షిణ ఆసియాలోని ఇతర ఉష్ణమండల ప్రాంతాల్లో వర్షా కాలంలో ఎక్కువగా ప్రబలుతుంది. మన దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. డెంగీ, స్క్రబ్‌ టైఫస్‌తో పాటు వర్ష కాలంలో మెలియాయిడోసిస్‌పై అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో నెల రోజుల వ్యవధిలో నలుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాధిపై అవగాహన కలిగి ఉండి, అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మెలియాయిడోసిస్‌ సోకిన వారిలో జ్వరం, దగ్గు, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి టీబీ వ్యాధిని (క్షయ) పోలి ఉండటంతో ఆ పరీక్షలు చేయించాలి. టీబీ అని తేలకపోతే మెలియాయిడోసిస్‌గా గుర్తించాలి. బ్లడ్‌ కల్చర్‌ ద్వారా మాత్రమే వ్యాధి నిర్ధారణ అవుతుంది.

వ్యాధి సోకే విధానం

మెలియోయిడోసిస్‌ అనేది మనుషులు, జంతువుల్లో వచ్చే బాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌. కలుషితమైన నేల, గాలి లేదా నీటితో సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. తుపానులు, భారీ వర్షాలు, ఇతర తీవ్రమైన వాతావరణ సంఘటనల తర్వాత కేసులు పెరగవచ్చు. ఈ వ్యాధి తరచుగా ఇతర పరిస్థితులతో పోల్చబడటం వల్ల నిర్ధారణ కష్టమవుతుంది. బ్యాక్టీరియా నేల నుంచి చర్మం కోతలు, పుండ్లు, వాటిని పీల్చడం లేదా కలుషితమైన నీటిని తాగడం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. బ్యాక్టీరియా సాధారణంగా మనుషుల నుంచి లేదా జంతువుల నుంచి వ్యాపించదు. త్వరగా చికిత్స చేయకపోతే, ఇన్ఫెక్షన్‌ శరీరంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించి, సెప్సిస్‌ (రక్త విషం) వంటి తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుంది. కొన్నిసార్లు మరణం కూడా సంభవిస్తుంది.

పలు అవయవాలపై ప్రభావితం

అవయవ వ్యవస్థను ప్రభావితం చేయవచ్చు, ఊపిరితిత్తులు, చర్మం, చర్మాంతర్గత కణజాలాలు, ఎముకలు, కీళ్లు, కాలేయం, ప్లీహము, క్లోమం, మూత్రపిండాలు, మూత్రాశయం, ప్రోస్టేట్‌, జననేంద్రియ అవయవాలు, మెదడు, మెనింజెస్‌, పరోటిడ్‌ గ్రంథులు (ముఖ్యంగా పిల్లలలో), శోషరస గ్రంథులు, పెరికార్డియం

పెద్దలపై ప్రభావం

మెలియోయిడోసిస్‌ సాధారణంగా 40 నుంచి 60 సంవత్సరాల వయస్సు వారిలో కొన్ని అంతర్లీన పరిస్థితులతో ప్రభావితం చేస్తుంది. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మెలియోయిడోసిస్‌ అరుదుగా వస్తుంది.

యాంటీబయాటిక్స్‌తో నయం

మెలియోయిడోసిస్‌ను యాంటీబయాటిక్‌ చికిత్స ద్వారా నయం చేయవచ్చు. అయితే, కొన్ని ఇన్ఫెక్షన్లు త్వరగా తీవ్రమవుతాయి. అన్ని సందర్భాల్లోనూ చికిత్స ప్రభావవంతంగా ఉండకపోవచ్చు. సకాలంలో తగిన చికిత్స అందించకపోతే మెలియోయిడోసిస్‌ 10 నుంచి 20 శాతం కేసుల్లో ప్రాణాంతకం అవుతుంది.

ఈ వ్యాధికి యాంటీబయాటిక్స్‌ తప్పనిసరిగా ఐదు నుంచి ఆరు వారాల పాటు వాడాలి. వర్షాకాలంలో కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయి. టీబీ లక్షణాలుగా భావించి వ్యాధిని సక్రమంగా గుర్తించకపోవడం వల్ల తీవ్రత పెరిగి ప్రాణాలుపోయే ప్రమాదం ఉంది. ప్రతి ఒక్కరూ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి. బ్లడ్‌ కల్చర్‌ ద్వారా మాత్రమే నిర్ధారణ జరుగుతుంది.

– డాక్టర్‌ కోగంటి కల్యాణ్‌ చక్రవర్తి,

ఇన్‌ఫెక్షన్‌ స్పెషలిస్టు, గుంటూరు

 మెలియాయిడోసిస్‌ 1
1/2

మెలియాయిడోసిస్‌

 మెలియాయిడోసిస్‌ 2
2/2

మెలియాయిడోసిస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement