
మహిళపై కత్తితో దాడి
నరసరావుపేట టౌన్: మంచినీటి పంపు వద్ద చోటు చేసుకున్న వివాదం మహిళపై కత్తితో దాడికి దారి తీసింది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దచెరువు రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ వద్ద కుళాయిలో తాగునీరు పట్టుకునే విషయంలో చల్లా సుధారాణికి, గుంజి తిరుమలకు మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సుధారాణిపై తిరుమల, అతని తండ్రి వెంకటేశ్వర్లు కత్తితో దాడికి పాల్పడ్డారు. సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని స్థానికులు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.