రేపు రెంటపాళ్లకి వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy visit to Rentapalla in Palnadu district has been finalized | Sakshi
Sakshi News home page

రేపు రెంటపాళ్లకి వైఎస్‌ జగన్‌.. షెడ్యూల్‌ ఖరారు

Jun 17 2025 3:39 PM | Updated on Jun 17 2025 6:46 PM

YS Jagan Mohan Reddy visit to Rentapalla in Palnadu district has been finalized

సాక్షి,గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. రేపు (బుధవారం) సత్తెన పల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లకు వెళ్లనున్నారు. పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న వైఎస్సార్‌సీపీ నేత, ఉపసర్పంచ్‌ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం, నాగమల్లేశ్వర రావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 

పర్యటనలో భాగంగా వైఎస్‌ జగన్‌ బుధవారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ చేరుకుంటారు. అక్కడ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు’ అని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.  

జగన్‌ పర్యటనను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నిస్తోంది. పోలీసు యంత్రాంగాన్ని ప్రయోగించి ఆంక్షల పేరిట కట్టడి చేయాలని భావిస్తోంది. అయితే జగన్‌ ఎట్టి పరిస్థితుల్లో జనం మధ్యే పర్యటిస్తారని వైఎస్సార్‌సీపీ కుండబద్ధలు కొడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement