మహానేతకు పండుగ నైవేద్యం
తొలిపంట ధాన్యంతో అభిషేకించిన రైతులు
కొయ్యలగూడెం: మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి రైతులు తొలిపంట ధాన్యంతో అభిషేకం, పండుగ నైవేద్యం సమర్పించి తమ అభిమానాన్ని చాటారు. రాజవరం పంచాయతీ గంగవరం గ్రామంలో మహానేత విగ్రహానికి తొలి పంటను(ఖరీఫ్ ధాన్యం) విగ్రహం వద్ద ఉంచి నూతన వస్త్రాలను విగ్రహానికి కట్టి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ కన్వీనర్ కంచర్ల సత్యనారాయణ మంగా వరలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో మరికొందరు రైతులు భోగి పండుగ పురస్కరించుకొని తమ ఇళ్లలో వండిన పిండి వంటలను విగ్రహాన్ని వద్ద ఉంచి నైవేద్యం సమర్పించారు. సంక్రాంతి పండుగ వేళ పూర్వీకులను, పితృ దేవతలను కొలవడం శుభ సూచకం అని, రైతాంగానికి దేవుడైన వైఎస్సార్ను ఈ విధంగా పూజించడం కృతజ్ఞతకు పట్టం కట్టడం వంటిదని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి దాసరి పేర్కొన్నారు. మహానేత ఆత్మ శాంతికై శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఎంపీటీసీ కొండేపాటి చింతయ్య, తమ్మిర్చి బ్రహ్మన్న, ఉండి ఆనందరావు, కొడారి చిన్న, కొడారి బాలయేసు, కె శ్రీను, కె రేఖ, తదితరులు పాల్గొన్నారు.
నరసాపురం రూరల్: నరసాపురం మండలం సీతారామపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం నుంచి హెలీకాప్టర్ ఎడ్వంచర్ రైడ్స్ ప్రారంభమయ్యాయి. శుక్రవారం వరకూ ఈ రైడ్స్ జరుగున్నాయి. విహాంగ్ పేరుతో తీరప్రాంతంలో మొట్టమొదటిసారి హెలీకాప్టర్ ఎడ్వంచర్ రైడ్స్ నిర్వహిస్తుండడంతో పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ రైడ్కు సంబందించి టిక్కెట్ ధర రూ.5 వేలు ఉండటంతో కుటుంబ పరంగా విహాంగ వీక్షణం చేద్దామనుకునేవారికి భారంగా మారిందని పలువురు పేర్కొంటున్నారు.
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లీగల్ సర్వీస్ అధారిటీలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓపెన్ కేటగిరీలో పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందన్నారు. దరఖాస్తు నిబంధనలు జిల్లా కోర్టు, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ, కలెక్టరేట్, ఎంప్లాయిమెంట్, సమాచార శాఖ, సోషల్ వెల్ఫేర్, బీసీ సంక్షేమ శాఖ, ఐటీడీఏ కోటరామచంద్రపురం, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శనకు ఉంచడం జరిగిందన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా కార్యాలయ పనిదినాల్లో చైర్పర్సన్ ప్రిన్సిపల్ జిల్లా జడ్జి, డీఎల్ఎస్ఏ, న్యాయ సేవాసదన్, జిల్లా కోర్టు కార్యాలయం ఆవరణ, ఏలూరు వారి చిరునామాకు రిజిస్టర్ పోస్టు ద్వారా పంపాలని కోరారు.
మహానేతకు పండుగ నైవేద్యం


