మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రజా సహకారం అవసరం | - | Sakshi
Sakshi News home page

మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రజా సహకారం అవసరం

Jun 19 2025 4:08 AM | Updated on Jun 19 2025 4:08 AM

మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రజా సహకారం అవసరం

మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రజా సహకారం అవసరం

రాజానగరం: రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే తమ సంకల్పానికి ప్రజా సహకారం కూడా ఉండాలని రాష్ట్ర ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఈగల్‌) ఆర్‌కే రవికృష్ణ అన్నారు. ఇందులో భాగంగా ప్రతి కళాశాలలోను విద్యార్థులతో ఈగల్‌ క్లబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి విద్యార్థి ఇందులో సభ్యునిగా ఉంటూ తన దృష్టికి వచ్చిన మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని 1972 నంబర్‌కు ఫోన్‌ చేసి తెలియజేయాలన్నారు. ఇందుకు సంబంధించిన కేసుల్లో నేరస్తులుగా ఎవరు పట్టుబడినా వారి భవిషత్తు నాశనం కాక తప్పదన్నారు. సైబర్‌ నేరగాళ్ల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఈగల్‌ క్లబ్‌లకు సంబంధించిన పోస్టర్‌ను గోదావరి గ్లోబల్‌ యూనివర్సిటీ (జీజీయూ) చాన్సలర్‌ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు)తో కలిసి విడుదల చేశారు. అడిషనల్‌ ఎస్పీ ఎన్‌బీ మురళీకృష్ణ, నార్త్‌ జోన్‌ డీఎస్పీ వై. శ్రీకాంత్‌, సీఐలు వీరయ్యగౌడ్‌, సూర్యమోహనరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.నాగేంద్ర, జీజీయూ వీసీ డాక్టర్‌ యు.చంద్రశేఖర్‌, ప్రొఫెసర్‌ వీసీ డాక్టర్‌ కేవీబీ రాజు, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంవీవీఎస్‌ శర్మ, పాల్గొన్నారు.

రాష్ట్ర ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఈగల్‌) రవికృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement