కొవ్వూరు మున్సిపల్‌ కమిషనర్‌పై బదిలీ వేటు | - | Sakshi
Sakshi News home page

కొవ్వూరు మున్సిపల్‌ కమిషనర్‌పై బదిలీ వేటు

Jun 19 2025 4:08 AM | Updated on Jun 19 2025 4:08 AM

కొవ్వ

కొవ్వూరు మున్సిపల్‌ కమిషనర్‌పై బదిలీ వేటు

కొవ్వూరు: స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న టి నాగేంద్ర కుమార్‌ను బదిలీ చేస్తూ బుధవారం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి ఫిర్యాదు మేరకు ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేష్‌ కుమార్‌ ఈ బదిలీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీడీఎంఏ)కు తక్షణమే రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు చెబుతున్నారు. గతంలో కమిషనర్‌పై ఓ మహిళ విషయంలో పలు ఆరోపణలు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కలెక్టర్‌కు బాధితులు చేసిన ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నట్టు తెలిసింది.

స్మార్ట్‌సిటీకి

మేలు చేసే ఒప్పందం

బోట్‌క్లబ్‌ (కాకినాడ): ఐఐఐటీ హైదరాబాద్‌, కాకినాడ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ పరస్పర సహకారంతో పనిచేసేందుకు ఒక ఒప్పందం చేసుకున్నాయి. దీని ద్వారా ఇంజినీరింగ్‌ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా, స్మార్ట్‌సిటీ అభివృద్ధికి సంబంధించిన ప్రత్యక్ష పరిశోధన, ప్రాజెక్టుల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించనున్నారు. స్మార్ట్‌సిటీ వింగ్‌ ల్యాబ్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆర్కిటెక్‌ వి అనురాధ నేతృత్వంలోని ప్రతినిధి బృందం , కై ట్‌ ప్రొఫెసర్లతో కలిసి వ్యూహాత్మక సహకార ప్రతిపాదనను సమర్పించడానికి బుధవారం కలెక్టర్‌ షణ్మోహన్‌ను కలిశారు. నగర అభివృద్ధిలో ఎదురవుతున్న ముఖ్యమైన సవాళ్లను అధిగమించడానికి ఐఐఐటీ అభివృద్ధి చేసిన వివిధ స్మార్ట్‌ సాంకేతికతలు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాధనాలు వినియోగించేందుకు ప్రతిపాదించారు. తాగునీటి పంపిణీపై రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌, పైపులైన్‌ లీకేజీల గుర్తింపు, తాగునీటి నాణ్యతపై విశ్లేషణ సాగుతాయి. ఈ భాగస్వామ్యం వల్ల స్మార్ట్‌ సిటీలో మౌలిక సదుపాయాలను గణనీయంగా ప్రోత్సహించే వీలుంటుంది. కలెక్టర్‌ను కలిసిన వారిలో కై ట్‌ కళాశాల అధినేత పోతుల విశ్వం ఉన్నారు.

యాంత్రీకరణ దిశగా

రైతుల అడుగులు

కాకినాడ సిటీ: వ్యవసాయంలో యాంత్రీకరణ దిశగా రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్లు, వివిధ యంత్ర పరికరాలను రాయితీపై అందిస్తుందని కలెక్టర్‌ షణ్మోహన్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడారు. 688 మంది రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలకు సంబంధించి మంజూరైన రాయితీ రూ.3.83 కోట్ల నమూనా చెక్కును అందజేశారు. అనంతరం రైతులకు వివిధ రకాల విత్తనాలకు సంబంధించిన మినీ కిట్లను, పవర్‌ స్ప్రేలను పంపిణీ చేశారు. జిల్లాకు 42 డ్రోన్లు లక్ష్యం కాగా ఇప్పటికి 35 మంది బ్యాంక్‌ అకౌంట్లు ఓపెన్‌ చేయగా, 25 మంది బ్యాంకుల్లో సొమ్ము డిపాజిట్‌ చేశారన్నారు. జిల్లాలో ఇప్పటికే నలుగురికి కిసాన్‌ డ్రోన్లు అందజేసినట్లు వివరించారు. ఈ నెల చివరి నాటికి మిగిలిన వారందరికీ రాయితీపై డ్రోన్లు అందజేస్తామని వెల్లడించారు. జిల్లా వ్యవసాయాధికారి ఎన్‌ విజయకుమార్‌ మాట్లాడుతూ భవిష్యత్తులో యాంత్రీకరణ లేకపోతే వ్యవసాయమే లేదన్నారు.

23న ఒలింపిక్‌ డే రన్‌

అమలాపురం టౌన్‌: జిల్లా ఒలింపిక్‌ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ ఉదయం జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాల్లో ఒలింపిక్‌ డే రన్‌లు నిర్వహించనున్నట్లు జిల్లా అసోసియేషన్‌ ప్రతినిధులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఒలింపిక్‌ రన్‌ బ్రోచర్లు, సర్టిఫికెట్లను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఒలింపిక్‌ సంఘం ప్రతినిధులు స్థానిక హౌసింగ్‌ బోర్డు కాలనీలో తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. 23వ తేదీ ఉదయం 9 గంటలకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఈ రన్‌లలో వ్యాయామ ఉపాధ్యాయులు, స్పోర్ట్స్‌ క్లబ్‌ల ప్రతినిధులు, ఎంఎస్‌డీవోలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొంటారని జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అల్లాడ శరత్‌బాబు తెలిపారు. పట్టణంలోని దుడ్డివారి అగ్రహారంలోని ఆఫీసర్‌ రిక్రియేషన్‌ క్లబ్‌ నుంచి కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ రన్‌ను ప్రారంభిస్తారని చెప్పారు. జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షుడు శరత్‌బాబు పర్యవేక్షణలో సంఘం ప్రతినిధులు కల్వకొలను బాబు, తిక్కిరెడ్డి సురేష్‌ల సహకారంతో ఈ రన్‌ సాగనుంది.

కొవ్వూరు మున్సిపల్‌  కమిషనర్‌పై బదిలీ వేటు 1
1/1

కొవ్వూరు మున్సిపల్‌ కమిషనర్‌పై బదిలీ వేటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement