యోగాంధ్రలో ‘నన్నయ’కు రికార్డు | - | Sakshi
Sakshi News home page

యోగాంధ్రలో ‘నన్నయ’కు రికార్డు

Jun 19 2025 7:39 AM | Updated on Jun 19 2025 7:39 AM

యోగాం

యోగాంధ్రలో ‘నన్నయ’కు రికార్డు

రాజానగరం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆదికవి నన్నయ యూనివర్సిటీ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన ‘మెగా యోగ’ కార్యక్రమానికి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం లభించింది. తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద యూనివర్సిటీ ఉన్న ‘నన్నయ’లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అదే స్థాయిలో 16,123 మంది హాజరు కావడంతో, దీనిని ఒక రికార్డుగా గుర్తించిన ఆ సంస్థ నిర్వాహకులు డాక్టర్‌ సి.కె. రాయుడు, తాతా వెంకట వరప్రసాద్‌లు అందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని వీసీ ఆచార్య ఎస్‌. ప్రసన్నశ్రీకి అందజేసి అభినందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలలు, క్యాంపస్‌ల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అంచనాలకు మించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్‌ుడ్సలోకి ఎక్కడంతో పాటు యూనివర్సిటీ చరిత్రలో ఒక చారిత్రిక ఘట్టంగా నిలిచిపోతుందన్నారు. ఇందుకు కారకులైన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం యోగ సాధన చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడంతో పాటు మేథో సంపత్తిని వృద్ధి చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులకు ఇది ఎంతో అవసరమన్నారు.

యోగాసనాలతో అబ్బురపరిచారు

యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్పెట్లపై విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది వేసిన యోగాసనాలు ఆబ్బురపరిచాయి. కానవరంలోని రాపర్తి రామ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా ప్రతినిధుల పర్యవేక్షణలో యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య కేవీ స్వామి తదితరులు పాల్గొన్నారు.

గోదావరి జిల్లాల నుంచి

16,123 మంది హాజరు

యోగాంధ్రలో ‘నన్నయ’కు రికార్డు 1
1/1

యోగాంధ్రలో ‘నన్నయ’కు రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement