Road Accident: Youth Deceased Bike Accident Nizamabad - Sakshi
Sakshi News home page

Road Accident: కొత్త బైక్‌ కొన్న ఆనందం.. పూజ కోసం వెళ్తూ..

Dec 22 2021 9:06 AM | Updated on Dec 22 2021 11:48 AM

Youth Deceased Bike Accident Nizamabad - Sakshi

కోళాపల్లి వద్ద ఆటో– బైక్‌ ఢీకొన్న దృశ్యం

సాక్షి,పెద్దశంకరంపేట(మెదక్‌)/నిజాంసాగర్‌(జుక్కల్‌): పెద్దశంకరంపేట 161 జాతీయ ప్రధాన రహదారి కోళాపల్లి వద్ద ఎదురెదురుగా ఆటో–బైక్‌ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఎస్సై నరేందర్‌ వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం వెల్గనూర్‌కు చెందిన గువ్వ సాయిలు(22) ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లో ఉంటూ డెకరేషన్‌ పనులు నిర్వహిస్తున్నాడు. ఇటీవలే కొత్త బైక్‌ కొనుగోలు చేశాడు.

బైక్‌కు పూజ చేయించేందుకు మంగళవారం స్వగ్రామానికి వెళ్తుండగా జోగిపేట వైపు నుంచి రాంగ్‌రూట్‌లో వస్తున్న ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో తలకు తీవ్రగాయమై రక్తస్రావం కావడంతో సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. అరగంటలో ఇంటికి చేరుకుంటాడనగా ప్రమాదం చోటుచేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సాయిలు తల్లి హన్మమ్మ గతంలోనే చనిపోగా, తండ్రి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆటోలో ఉన్న చాకలి రవీందర్‌కు గాయాలు కాగా అతడిని హైవే అంబులెన్స్‌లో పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సాయిలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

చదవండి: ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే.. కళ్లలో కారం చల్లి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement