అర్జంటుగా దుస్తులు మార్చుకుంటానని స్నేహితురాలి గదికి వెళ్లి

Woman Steals Gold Ornaments From Friends House In Karnataka - Sakshi

సాక్షి, బనశంకరి(కర్ణాటక): పెళ్లికి పిలవడానికి స్నేహితురాలి ఇంటికి వెళ్లి ఆమె ఇంట్లోనే రూ.11 లక్షల విలువచేసే బంగారు నగలను అపహరించిందో యువతి. ఈఘటన జేజే.నగర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. దేవరజీవనహళ్లి నివాసి అజీరా సిద్దిక్‌ నిందితురాలు. పాదరాయనపుర నివాసి రోహినాజ్‌ అనే మహిళ ఇంటికి అజీరా ఈ నెల 14న సోదరుని పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్లింది.

అర్జంటుగా దుస్తులు మార్చుకుంటానని బీరువా ఉన్న గదిలోకి వెళ్లింది. అక్కడ 206 గ్రాముల బంగారు ఆభరణాలను కాజేసింది. రోహినాజ్‌ మరుసటి రోజు చూడగా నగలు కనిపించలేదు. దీంతో జేజే నగర పోలీసులకు ఫిర్యాదు చేయగా, అజీరాను గట్టిగా ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించింది. నగలను ఆమె ఇంటిపైన నీటి ట్యాంకర్‌ లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. 

చదవండి: ఉద్యోగుల ఆందోళన వాయిదా

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top