అర్ధరాత్రి మహిళపై సామూహిక అత్యాచారం..

Woman Harassed After Her Toddler Taken Hostage At Gunpoint - Sakshi

భోపాల్‌: దేశంలో మహిళలు, యువతులపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొందరు మృగాలు రెచ్చిపోయి మరీ లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. మానవత్వం మరచి ఆమె మూడేళ్ల కుమారుడి ఎదుటే ఇద్దరు వ్యక్తులు ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని భింద్‌ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు ఓ మహిళ(24)పై లైంగిక దాడి చేశారు. బాధితురాలు తన మూడేళ్ల కొడుకుతో కలిసి వెళ్తుండగా దుండగులు ఆ బాలుడికి గన్‌తో చంపేస్తామని బెదిరించి.. తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకోగా.. బాధితురాలు శనివారం మోహగావ్‌ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను విక్రమ్‌, కృష్ణ శర్మగా గుర్తించారు. ఈ ఘటన తర్వాత నిందితులిద్దరూ పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో వారి కోసం పోలీసులు బృందాలు గాలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top