ఒకే స్పాట్‌లో మూడు ప్రమాదాలు.. ఐదుగురు మృతి

Three Road Accidents At Divis Lab Center Choutuppal - Sakshi

సాక్షి, నల్గొండ: ఒకే స్పాట్‌లో మూడు ప్రమాదాలు చోటు చేసుకోవటంతో ఐదుగురు మృతి చెందారు. చౌటుప్పల్‌లోని దివిస్‌ ల్యాబ్‌ సెంటర్‌ మృత్యుదారిగా మారింది. గంటల వ్యవధితో మూడు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. బై​క్‌పై వెళ్తున్న తండ్రి కొడుకులను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రి మృతి చెందగా, కొడుకుకు తీవ్ర గాయాలు అయ్యాయి.

మరో ఘటనలో బైక్‌ను టిప్పర్‌ లారీ ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ధర్మోజీగూడెం దగ్గర కారును బస్సు ఢీకొట్దింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top