చిత్తూరు: కుటుంబంపై టీడీపీ నాయకుల దౌర్జన్యం | TDP Leaders Attack On Family In Chittoor District | Sakshi
Sakshi News home page

చిత్తూరు: కుటుంబంపై టీడీపీ నాయకుల దౌర్జన్యం

Jan 3 2022 2:55 PM | Updated on Jan 3 2022 2:55 PM

TDP Leaders Attack On Family In Chittoor District - Sakshi

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నీలమ్మ

 మండలంలోని కర్లగట్టలో అడ్డుగా ఉన్న తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మెను తొలగించాలని ఫిర్యాదు చేసిన వారిపై ఆ పార్టీ నాయకులు దౌర్జన్యానికి దిగారు.

శాంతిపురం(చిత్తూరు జిల్లా): మండలంలోని కర్లగట్టలో అడ్డుగా ఉన్న తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మెను తొలగించాలని ఫిర్యాదు చేసిన వారిపై ఆ పార్టీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. వివరాలు.. తమ ఇంటి గుమ్మానికి అడ్డుగా ఉన్న జెండా దిమ్మెను తొలగించాలని కర్లగట్టకు చెందిన చిన్నస్వామి కుటుంబీకులు ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నాయకులు ఆదివారం చిన్నస్వామి ఇంటిపై దాడికి దిగారు.

చదవండి: AP: ప్రాణం నిలిపిన కలెక్టర్‌

చిన్నస్వామి భార్య నీలమ్మ, కుమారుడు రవీంద్రను విచక్షణారహితంగా కొట్టారు. ఇంటి ముందు మెట్లను తొలగించి రాకపోకలకు దారి లేకుండా చేశారు. టీడీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడిన నీలమ్మను స్థానికులు కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రెస్కో మాజీ డైరెక్టర్‌ మునిరామయ్య, మాజీ సర్పంచ్‌ రుద్రప్పతో పాటు మరి కొందరిపై కేసు నమోదు చేసినట్లు రాళ్లబూదుగూరు ఎస్‌ఐ లక్ష్మిరెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement