శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య  | Student Commits Suicide At Sri Chaitanya College Vijayawada | Sakshi
Sakshi News home page

శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య 

Mar 11 2021 5:14 AM | Updated on Mar 11 2021 5:14 AM

Student Commits Suicide At Sri Chaitanya College Vijayawada - Sakshi

సాక్షి, కంకిపాడు: కృష్ణా జిల్లాపునాదిపాడు శ్రీచైతన్య క్యాంపస్‌లో ఇంటర్‌ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అనంతపురానికి చెందిన దాసరి లాస్యశ్రీ (16)ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతోంది. బుధవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోరంకిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ఎస్‌ఐ వై. దుర్గారావు సహచర విద్యార్థులను విచారించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దుర్గారావు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement