మరో ఎన్‌కౌంటర్‌: నకిలీ నోట్ల అక్రమ రవాణాదారు అజయ్‌పై కాల్పులు | Fake Currency Smuggler Injured In Guwahati Encounter, Police Probe Massive Counterfeit Racket, More Details Inside | Sakshi
Sakshi News home page

మరో ఎన్‌కౌంటర్‌: నకిలీ నోట్ల అక్రమ రవాణాదారు అజయ్‌పై కాల్పులు

Jul 4 2026 3:19 PM | Updated on Jul 4 2026 3:58 PM

Police shot Ajay Vishwakarma in the leg of counterfeit note smuggler

గువాహటి: నకిలీ నోట్ల అక్రమ రవాణాదారు అజయ్‌ విశ్వకర్మ ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డాడు. అతడిని చికిత్స కోసం జీఎంసీహెచ్‌ ఆస్పత్రిలో చేర్చారు. గువాహటి నగరంలో శనివారం తెల్లవారుజామున ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. 

కొన్ని రోజుల క్రితం గువాహటిలోని 3 చోట్ల పోలీసులు దాడులు చేపట్టి భారీ మొత్తంలో నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. సిక్స్‌మైల్‌లో దిస్‌పూర్‌ పోలీసులు ఏఎస్-01-పీసీ-8433 నంబరు స్విఫ్ట్‌ డిజైర్‌ కారు నుంచి రూ. 2.56 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దేవజిత్‌ దేయూరి, అజయ్‌ విశ్వకర్మను అరెస్టు చేశారు.

పోలీసుల విచారణలో అజయ్‌ విశ్వకర్మ సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. తన వాదన ప్రకారం, గువాహటి నగరంలో ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా నకిలీ నోట్లు చెలామణీ అయ్యాయి. అలాగే, లఖింపూర్‌ జిల్లాలోని బొంగాల్మారా కేంద్రంగా భారీ నకిలీ నోట్ల అక్రమ రవాణా ముఠా చురుకుగా పని చేస్తోందని వెల్లడించాడు.

బుధవారం రాత్రి మాలిగావ్‌, సిక్స్‌మైల్‌ ప్రాంతాల్లో వేర్వేరుగా చేపట్టిన దాడుల్లో పోలీసులు మొత్తం దాదాపు రూ. 10 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. మాలిగావ్‌లో కామాఖ్య రైల్వే జంక్షన్‌ ప్రాంతం నుంచి రూ. 7.37 లక్షల విలువైన నకిలీ నోట్లతో దయాల్‌ దాస్‌, గోలాబ్‌ షేక్‌ను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లను ఝార్ఖండ్‌కు తరలిస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement