Woman Ends Life 2 Months After Marriage In Kuppam - Sakshi
Sakshi News home page

రెండు నెలల క్రితం లవ్‌ మ్యారేజ్‌.. అంతలోనే షాకింగ్‌ ఘటన.. అసలు ఏం జరిగింది?

Nov 4 2022 7:41 AM | Updated on Nov 4 2022 8:53 AM

Married Woman Suspicious Death In Kuppam - Sakshi

రోహిత్, భువనేశ్వరి పెళ్లి ఫొటో (ఫైల్‌)

తర్వాత పెద్దలు అంగీకరించడంతో రోహిత్‌కుమార్‌ ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. గురువారం రాత్రి భువనేశ్వరి ఇంట్లో ఉరి వేసుకుని శవమై కనిపించింది.

కుప్పం(చిత్తూరు జిల్లా): పట్టణంలో గురువారం రాత్రి వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. ఆజాద్‌ రోడ్డులో ఉంటున్న రోహిత్‌కుమార్, భువనేశ్వరి రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత పెద్దలు అంగీకరించడంతో రోహిత్‌కుమార్‌ ఇంట్లోనే కాపురం ఉంటున్నారు.

గురువారం రాత్రి భువనేశ్వరి ఇంట్లో ఉరి వేసుకుని శవమై కనిపించింది. తమ కుమార్తెను రోహిత్‌ కుటుంబ సభ్యులే కడతేర్చారని భువనేశ్వరి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి మృతురాలి తండ్రి శరవణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
చదవండి: వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య   

Advertisement
 
Advertisement
Advertisement